25, జులై 2013, గురువారం

రావణుడు యుద్ధంలో మరణించ లేదా .?

రావణాసురుడి చరిత్రపై శ్రీలంకలో ఇటీవల విడుదలైన  పుస్తకం సంచలనం సృష్టిస్తోంది. "రావణ్ ద కింగ్ ఆఫ్ లంక" పేరుతో ప్రముఖ పరిశోధకుడు మిరాండో ఒబెసిక్రి రాసిన 174 పేజీల  పుస్తకం చరిత్రను మరో కోణంలో పరిచయం చేస్తోంది. ముఖ్యంగా రావణాసురుడి పాలనా దక్షత, ఆనాటి శ్రీలంక దేశ శాస్త్ర-సాంకేతిక పురోగతి , వైభవాన్ని , పాలనా విశేషాలను మునుపెన్నడూ తెలియని కోణంలో వివరించే ప్రయత్నం చేస్తోంది...స్వతహాగా పండితుడైన రావణుడు విశిష్ట పరిపాలన అందించారట. ఆ కాలంలోనే శ్రీలంక లో ప్రణాళికా బద్ధమైన నగరీకరణ విలసిల్లినట్లు సమాచారం.  రాజ్యపరిరక్షణ కోసం విస్తారంగా సొరంగమార్గాల్ని ఏర్పాటు చేశారట .  రావణుడి ఆస్థానంలో విశేష ప్రావీణ్యం ఉన్న శాస్త్రవేత్తలు ఉండేవారట. వాళ్లురాళ్లను సైతం బన్నులంతా తేలిగ్గా మార్చే రసాయన విద్యల్లో నిష్ణాతులట  . రావణుడు బండరాళ్లపై రసాయనాలు ప్రయోగించి., సముద్రాల్లోనూ సొరంగ మార్గాలు నిర్మించినట్లు ప్రతీతి. చారిత్రక పరిశోధనలు ఇదే విషయాన్ని రుజువు చేసే పనిలో ఉన్నాయి..
రాజ్య పరిరక్షణకు సుశిక్షుతులైన సైన్యాన్ని రావణుడు ఏర్పాటు చేశారట . యుద్ధ పరిసరాల్లో కలిసిపోయేలా దుస్తుల్ని ధరించటం మొదలు పెట్టిన మొట్టమొదటి సైన్యం రావణాసురుడిదే అట . ఆయన సైన్యం యుద్ధాల్లో త్రాచుపాము విషం కలిపిన మారణాయుధాల్ని ఎక్కువగా ఉపయోగించే వారట . ప్రపంచలో మొట్టమొదటి విమానాన్ని కలిగిఉన్న పాలకుడు రావణుడే. బలమైన నావికాదళాన్ని సైతం ఆయన నిర్మించుకున్నాడట . ఆ రోజుల్లో తీవ్ర నేరాలు చేసిన వాళ్లను సజీవంగా సమాధి చేయటం వంటి కఠిన శిక్షల్ని అమలు చేసినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
మనకు తెలిసిన రామాయణం ప్రకారం రామబాణం వేటుకు రావణాసురుడు కుప్పకూలాడు . అయితే మిరాండో పరిశోధనల్లో మాత్రం రావణుడు రామ-రావణయుద్ధంలో చావలేదు. కానీ విషపూరితమైన రాముడి బాణాలు తగిలి., కొంత కాలం తర్వాత చనిపోయాడు. అలాగే  అజేయమైన, సైన్యం అనన్య శస్త్రాస్త్రాలు న్న రావణాసురుడు ఓ సామాన్యరాజైన రాముడి చేతిలో చనిపోవటానికి అంతఃపుర కుట్రలు కారణం అని  తాజా పుస్తకం వెల్లడిస్తోంది. రావణాసురుడి భార్య మండోదరి, తమ్ముడు విభీషణుడు రాముడి పక్షం వహించటంతో., రావణుడి యుద్ధ వ్యూహాలన్నీ ముందుగానే రాముడి శిబిరానికి తెలిసిపోయేవి. ఫలితంగా రావణాసురుడితో పోలిస్తే., ఏ మాత్రం సరితూగలేని రాముడి వానరసైన్యం .., సునాయాసంగా విజయం సాధించారట .  ముల్లోకాల్ని గడగడలాడించిన రావణుడు కేవలం అంతఃపుర కుట్రలకు, సొంతవాళ్ల నమ్మకద్రోహం కారణంగా ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నట్లు తాజా పుస్తకం వివరిస్తోంది. ఇదే విషయాన్ని రచయిత, ఉత్తరాది నుంచి వచ్చిన ఓ ఆర్యన్ తెగ దాడులతో శ్రీలంక చరిత్రలోనే విశిష్టమైన రావణాసురుడి శకం ముగిసినట్లు చెబుతాడు..