13, అక్టోబర్ 2016, గురువారం

10 వేల కోట్ల వ్యవహారంపై మోడీకి జగన్ లేఖ

హైదరాబాద్‌ నుంచి రూ.10వేల కోట్ల నల్లధనం ప్రకటించిన వ్యక్తి వైసీపీ అధ్యక్షుడు జగనే అని తెలుగు దేశం పార్టీ పదే పదే ఆరోపణలు చేస్తోన్న నేపధ్యంలో ఈ వ్యవహారం పై విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని గురువారం జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసారు. ఏపీ, తెలంగాణల నుంచి వెల్లడి అయిన నల్ల ధనం మొత్తం విలువ 13 వేల కోట్లు అని లెక్క తేలితే అందులో హైదరాబాద్ నుంచి 10 వేల కోట్లు ఒక్కరే ప్రకటించారని ఆ ఒక్కరు జగనే అని ఈ ఆరోపణ చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారం పై స్పందించిన జగన్ ఈ లేఖ రాసారు.ఈ లేఖలోనే జగన్ మరి కొన్ని అంశాలను ప్రస్తావించారు. స్వచ్చంద ఆదాయ వెల్లడి పధకం ప్రకారం ఏ వ్యక్తి ఎంత ప్రకటించారు ? ఏ ప్రాంతం నుంచి ప్రకటించారు తదితర వివరాలు బయటకు వెల్లడించరు. మోడీ ప్రభుత్వమే ఈ విషయాన్నీ స్పష్టం గా చెప్పింది. ఈ క్రమంలో మరి ఆ వివరాలు చంద్రబాబుకు ఎలా తెలిసాయి? అని జగన్ పేర్కొన్నారు.  to read more click on the matter.