12, అక్టోబర్ 2016, బుధవారం

ఈనాటి బంధం ఏనాటిదో ?

ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలితను దగ్గరుండి కనిపెట్టుకుని చూస్తున్న బృందం లో శశికళా నటరాజన్ ఒకరు . తమిళనాడు రాష్ట్ర పాలనా వ్యవహారాలను షీలా బాలకృష్ణన్ చూస్తుంటే ... శశి రాజకీయ వ్యవహారాలను నడిపిస్తున్నారు. శశి జయ ప్రాణసఖి. వీరిద్దరిది విడదీయ లేని బంధం. జయ, శశిల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈనాటిది కాదు. 1991లో అన్నాడిఎంకె అధికారంలోకి వచ్చిన తరువాత అది వెలుగు చూసింది. అంతకుముందు నుంచే వీరిద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నా అది పోయస్ గార్డెన్‌కే పరిమితం. అధికారంలోకి వచ్చాక ఇద్దరూ కలిసి కనిపించడంతో వీరి స్నేహం బహిర్గతమయ్యింది. గతంలో శశికళ వీడియో క్యాసెట్ల దుకాణం నడిపేది. అన్నాడిఎంకె వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జయలలిత ఆ పార్టీకి ప్రచార కార్యదర్శిగా పని చేసే వారు.శశికళ ఆ ప్రచారానికి సంబంధించిన వీడియో క్యాసెట్లు తీసుకుని వచ్చి జయలలితకు అందజేసేవారు. అలా వీరిద్దరి మధ్య స్నేహం కుదరడంతో శశికళ, జయలలిత దగ్గరే ఉండిపోయారు. 1991లో పార్టీ అధికారంలోకి రావడంతో శశికళకు పార్టీలో పట్టు దొరికింది. జయలలితకు ఆమె మరీ అంతగా ఎలా దగ్గరయ్యారో ఈనాటికీ అంతుబట్టని విషయం. జయలలిత స్వతహాగా తెలివైనవారు.  to  see  more
click on the matter 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి