30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

అమ్మ ఆరోగ్యంపై సోషల్ మీడియా కథనాలు నిజం కాదట!!

తమిళనాడు  సీఎం జయలలిత ఆరోగ్యం పై  సోషల్ మీడియా లో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.
అయితే అవన్నీ అవాస్తవమని , జయలలిత కోలుకుంటున్నారని  అపోలో హాస్పిటల్ వైద్యులు , అన్నాడీఎంకే నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ 23 న జయలలిత జ్వరం , డీహైడ్రేషన్ తో ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి హాస్పిటల్ వర్గాలు ఆమె కోలుకుంటున్నారని ఒకటి రెండు బులెటిన్స్ విడుదల చేశాయి కానీ ఫోటోలు ఏమి విడుదల చేయలేదు. ఆమె వైద్యానికి సహకరిస్తున్నారని , కోలుకోవడానికి మరికొద్ది రోజులు పడుతుందని వైద్యులు అంటున్నారు. వారం రోజులు అయినా డిశ్చార్జ్ కాకపోవడం తో   ఏదో గోప్యత పాటిస్తున్నారని ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇదిలా ఉంటే డీఎంకే అధినేత కరుణా నిధి కూడా జయ ఆరోగ్యం పై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయక పోవడం మూలానా ప్రజలు ఉద్వేగానికి గురవుతున్నారని అన్నట్టు వార్తలు వెలువడ్డాయి. జయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ పేరిట  అమ్మఆరోగ్యం బాగున్నట్టు గురువారం ఒక ప్రెస్ నోట్  రిలీజ్ అయింది. కాగా అమ్మ  ఆరోగ్యం పై సోషల్ మీడియా లో వ్యతిరేక ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇక అమ్మ అభిమానులు జయ త్వరితగతిన కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. దేవుళ్ళకు మొక్కుతున్నారు.

1 కామెంట్‌: