9, అక్టోబర్ 2022, ఆదివారం
8, అక్టోబర్ 2022, శనివారం
16, అక్టోబర్ 2016, ఆదివారం
శంకరన్న ఏం చేస్తున్నారో ???
రాత్రిళ్ళు అదృశ్యమయ్యే ఆలయం !!
గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ పట్టణానికి దగ్గర్లో ఉన్న కోలియాక్ గ్రామానికి సమీపంలో అరేబియా సముద్రంలో పరమేశ్వరుని దేవాలయం ఉంది . ఈ ఆలయాన్ని ‘నిష్కళంక మహాదేవ ఆలయం’ అని అంటారు. ప్రతి దేవాలయంలో ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ దేవాలయంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇదొక వింత ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకత మరెక్కడా చూడలేము. అదేమిటంటే… మిగతా వివరాలకోసం పై మేటర్ పై క్లిక్ చేయండి ... వీడియో ను చూడండి.http://www.kaburluguru.com/banner/single/351
13, అక్టోబర్ 2016, గురువారం
10 వేల కోట్ల వ్యవహారంపై మోడీకి జగన్ లేఖ
12, అక్టోబర్ 2016, బుధవారం
ఈనాటి బంధం ఏనాటిదో ?
8, అక్టోబర్ 2016, శనివారం
2, అక్టోబర్ 2016, ఆదివారం
బాబు గారు.. ఫేస్ బుక్ ను బ్యాన్ చేసేయండి సారూ !!
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు , ఏపీ సీఎం చంద్రబాబు గారికి నమస్కారం. మీ వీరాభిమాని ఆరుమళ్ల అప్పారావు రాయు లేఖ. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకు రావాలని ఈ లేఖ రాస్తున్నాను. అయ్యా ఈమధ్య మీమాటలు చిత్ర,విచిత్రం గా ఉంటున్నాయి. వాటిపై ఫేస్బుక్ లో పంచ్ ల పై పంచ్ లు పడుతున్నాయి. జోకులు పేలుతున్నాయి. చూడ లేక చస్తున్నాం. రచ్చబండ దగ్గర కుర్రోళ్ళు అవి చెప్పుకుంటూ , చూసుకుంటూ విరగబడి నవ్వుతున్నారు. వాళ్ళు అలా నవ్వుతుంటే.... ఏం చెప్పలేకపోతున్నాం .. ఏం చేయలేక పోతున్నాం. 'లోకేష్ బాబు వద్దంటేనే ప్రధాని పదవి వదిలేశా ' అని మీరు చెప్పినట్టు మన పత్రికలోనే వచ్చింది. అలాగే' ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రమ్మని ' తమరే చెప్పినట్టు మన పత్రికలోనే వార్తలొచ్చాయి. 'పట్టి సీమ కాలువ ను నదిగా మార్చేస్తా' అన్నారు .ఇదీ అంతే. ఆ జగన్ పేపర్ లో వస్తే నమ్మేవాళ్లం కాదు. అయినా కాలువ ను నదిగా ఎలా మారుస్తారు సారూ? ఇక బావులను అనుసంధానం చేస్తామని అన్నారట ? ఇది సాధ్యమేనా సారూ ?ఇలాంటివెన్నో మీరు అన్నట్టు వస్తున్నాయి. అయినా మీరు ఏంటీ ? మీ స్థాయి ఏంటీ సారూ ? మీ గురించి మీరు చెప్పుకుంటే విలువ ఏముంటది ? పార్టీ లో, ప్రభుత్వం లో బోలెడు మంది ఉన్నారు . వాళ్ళు చెబితే బాగుంటుంది కదా!! ఆమధ్య 'నేను మారాను' అని మీరంటే నిజమే అనుకున్నా. కానీ ఈ విధంగా మారతారని అనుకోలా. -ఫర్ See more లింక్ పై క్లిక్ చేయండి 1, అక్టోబర్ 2016, శనివారం
30, సెప్టెంబర్ 2016, శుక్రవారం
అమ్మ ఆరోగ్యంపై సోషల్ మీడియా కథనాలు నిజం కాదట!!
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం పై సోషల్ మీడియా లో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.
అయితే అవన్నీ అవాస్తవమని , జయలలిత కోలుకుంటున్నారని అపోలో హాస్పిటల్ వైద్యులు , అన్నాడీఎంకే నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ 23 న జయలలిత జ్వరం , డీహైడ్రేషన్ తో ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి హాస్పిటల్ వర్గాలు ఆమె కోలుకుంటున్నారని ఒకటి రెండు బులెటిన్స్ విడుదల చేశాయి కానీ ఫోటోలు ఏమి విడుదల చేయలేదు. ఆమె వైద్యానికి సహకరిస్తున్నారని , కోలుకోవడానికి మరికొద్ది రోజులు పడుతుందని వైద్యులు అంటున్నారు. వారం రోజులు అయినా డిశ్చార్జ్ కాకపోవడం తో ఏదో గోప్యత పాటిస్తున్నారని ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇదిలా ఉంటే డీఎంకే అధినేత కరుణా నిధి కూడా జయ ఆరోగ్యం పై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయక పోవడం మూలానా ప్రజలు ఉద్వేగానికి గురవుతున్నారని అన్నట్టు వార్తలు వెలువడ్డాయి. జయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ పేరిట అమ్మఆరోగ్యం బాగున్నట్టు గురువారం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. కాగా అమ్మ ఆరోగ్యం పై సోషల్ మీడియా లో వ్యతిరేక ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇక అమ్మ అభిమానులు జయ త్వరితగతిన కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. దేవుళ్ళకు మొక్కుతున్నారు.
అయితే అవన్నీ అవాస్తవమని , జయలలిత కోలుకుంటున్నారని అపోలో హాస్పిటల్ వైద్యులు , అన్నాడీఎంకే నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ 23 న జయలలిత జ్వరం , డీహైడ్రేషన్ తో ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి హాస్పిటల్ వర్గాలు ఆమె కోలుకుంటున్నారని ఒకటి రెండు బులెటిన్స్ విడుదల చేశాయి కానీ ఫోటోలు ఏమి విడుదల చేయలేదు. ఆమె వైద్యానికి సహకరిస్తున్నారని , కోలుకోవడానికి మరికొద్ది రోజులు పడుతుందని వైద్యులు అంటున్నారు. వారం రోజులు అయినా డిశ్చార్జ్ కాకపోవడం తో ఏదో గోప్యత పాటిస్తున్నారని ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇదిలా ఉంటే డీఎంకే అధినేత కరుణా నిధి కూడా జయ ఆరోగ్యం పై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయక పోవడం మూలానా ప్రజలు ఉద్వేగానికి గురవుతున్నారని అన్నట్టు వార్తలు వెలువడ్డాయి. జయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ పేరిట అమ్మఆరోగ్యం బాగున్నట్టు గురువారం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. కాగా అమ్మ ఆరోగ్యం పై సోషల్ మీడియా లో వ్యతిరేక ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇక అమ్మ అభిమానులు జయ త్వరితగతిన కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. దేవుళ్ళకు మొక్కుతున్నారు.
27, సెప్టెంబర్ 2016, మంగళవారం
తండ్రులు ఒకే ... తనయులు వీక్ !!
3, ఫిబ్రవరి 2014, సోమవారం
సోనియా ఆస్తులెంత???
19, సెప్టెంబర్ 2013, గురువారం
డిగ్గీరాజా నోటికి తాళం
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్గా దిగ్విజయ్ సింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ సీన్ పూర్తిగా మార్చేశారు. అలా వచ్చి రాగానే విభజన, సమైక్యంపై రాష్ట్రంలో ముఖ్యనేతల నుంచి నివేదికలు కోరడంతోనే రాజకీయ వేడి రగిలింది. దానిని క్రమంగా పెంచుకుంటూ పోయారు. అటు అధిష్టానం కూడా తెలంగాణపై తేల్చేసింది. విభజనకు అనుకూలమని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని తెలిపింది.. ఈ ప్రకటన తర్వాత సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ప్రారంభమైంది.రోజురోజుకి ఉద్యమం ఉధృతమవుతుంటే..దానికి ఆజ్యంపోసేలా దిగ్విజయ్.. తెలంగాణపై వెనక్కు వెళ్లేది లేదని పదే పదే ప్రకటనలు చేశారు . దీనిపైనే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఒక వైపు సమైక్య నిరసనలు మిన్నంటుతుంటే ఢిల్లీ నుంచి వచ్చే ప్రకటనలతో సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలే టార్గెట్గా మారారు. ముఖ్యంగా కేంద్రమంత్రులు, ఎంపీలపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది.సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు.. కాంగ్రెస్ హైకమాండ్కు దిగ్విజయ్ దూకుడుకు కళ్లెం వేయాలని వేడుకోవటంతో ప్రస్తుతం ఆయన మౌనం పాటిస్తున్నారని ఢిల్లీ వర్గాలంటున్నాయి. విభజన ప్రకటన తర్వాత రాష్ట్రానికి వస్తానని.. ఇరు ప్రాంత నేతలతో చర్చించి.. సమస్య పరిష్కారం చేస్తానని చెప్పిన దిగ్విజయ్ ఇప్పుడు పత్తా లేరు. మన రాష్ట్రానికి రావడం పక్కన పెడితే.. కనీస ఏపీ వ్యవహారాలపై స్పందించడం కూడా మానేశారు. ఇక సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగడంతో విభజన ప్రక్రియపై కాంగ్రెస్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. క్రమంగా కేబినెట్ నోట్ను కూడా వివిధ కారణాల సాకుతో వాయిదా వేసుకుంటూ వస్తుంది. ఈ సమయంలో మీడియా విభజనపై ఎందుకు ముందడుగు వేయటం లేదని ప్రశ్నిస్తే.. ఏమని సమాధానం చెప్పాలి..? అనేది కూడా దిగ్విజయ్ సింగ్కు అంతుబట్టడం లేదు.. మొత్తానికి డిగ్గీరాజా.. నోటికి తాళం వేసుకున్నారు. అప్పడప్పుడు మోడీ మీద విమర్శల బాణాలు విసురుతున్న ఏపీ వ్యవహారాల మీద మాత్రం నోరు మెదపడం లేదు.
1, ఆగస్టు 2013, గురువారం
'రాములమ్మ' దారెటు?
25, జులై 2013, గురువారం
రావణుడు యుద్ధంలో మరణించ లేదా .?
రాజ్య పరిరక్షణకు సుశిక్షుతులైన సైన్యాన్ని రావణుడు ఏర్పాటు చేశారట . యుద్ధ పరిసరాల్లో కలిసిపోయేలా దుస్తుల్ని ధరించటం మొదలు పెట్టిన మొట్టమొదటి సైన్యం రావణాసురుడిదే అట . ఆయన సైన్యం యుద్ధాల్లో త్రాచుపాము విషం కలిపిన మారణాయుధాల్ని ఎక్కువగా ఉపయోగించే వారట . ప్రపంచలో మొట్టమొదటి విమానాన్ని కలిగిఉన్న పాలకుడు రావణుడే. బలమైన నావికాదళాన్ని సైతం ఆయన నిర్మించుకున్నాడట . ఆ రోజుల్లో తీవ్ర నేరాలు చేసిన వాళ్లను సజీవంగా సమాధి చేయటం వంటి కఠిన శిక్షల్ని అమలు చేసినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
మనకు తెలిసిన రామాయణం ప్రకారం రామబాణం వేటుకు రావణాసురుడు కుప్పకూలాడు . అయితే మిరాండో పరిశోధనల్లో మాత్రం రావణుడు రామ-రావణయుద్ధంలో చావలేదు. కానీ విషపూరితమైన రాముడి బాణాలు తగిలి., కొంత కాలం తర్వాత చనిపోయాడు. అలాగే అజేయమైన, సైన్యం అనన్య శస్త్రాస్త్రాలు న్న రావణాసురుడు ఓ సామాన్యరాజైన రాముడి చేతిలో చనిపోవటానికి అంతఃపుర కుట్రలు కారణం అని తాజా పుస్తకం వెల్లడిస్తోంది. రావణాసురుడి భార్య మండోదరి, తమ్ముడు విభీషణుడు రాముడి పక్షం వహించటంతో., రావణుడి యుద్ధ వ్యూహాలన్నీ ముందుగానే రాముడి శిబిరానికి తెలిసిపోయేవి. ఫలితంగా రావణాసురుడితో పోలిస్తే., ఏ మాత్రం సరితూగలేని రాముడి వానరసైన్యం .., సునాయాసంగా విజయం సాధించారట . ముల్లోకాల్ని గడగడలాడించిన రావణుడు కేవలం అంతఃపుర కుట్రలకు, సొంతవాళ్ల నమ్మకద్రోహం కారణంగా ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నట్లు తాజా పుస్తకం వివరిస్తోంది. ఇదే విషయాన్ని రచయిత, ఉత్తరాది నుంచి వచ్చిన ఓ ఆర్యన్ తెగ దాడులతో శ్రీలంక చరిత్రలోనే విశిష్టమైన రావణాసురుడి శకం ముగిసినట్లు చెబుతాడు..
21, జూన్ 2013, శుక్రవారం
శంకరన్నకు ఎన్నికష్టాలు ??
పాపం మాజీ మంత్రి శంకర్రావు మళ్ళీ కష్టాల్లో చిక్కుకున్నారు . అందరికీ నీతులు బోధించే శంకరన్న మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. స్వయానా కోడలి ను హింసించిన కేసులో పోలీసు స్టేషన్ లో లొంగిపోయి బెయిల్ తీసుకుని బయటపడ్డాడు. నిత్యం వివాదాలతో సావాసం, నోటికొచ్చినట్టు మాట్లాడి సంచలనాల కోసం పాకులాడడం శంకర్రావు స్టయిల్. గురివింద చందంగా తనకు నచ్చనివారిపై ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటు. ఇదే ఆయనకు కష్టాలు తెచ్చిపెట్టింది.
వైఎస్ జగన్ పై ఆరోపణలు చేసి రాష్ట్ర కేబినెట్ లో చోటు సంపాదించిన శంకర్రావు తన 'లూజ్ టంగ్'తో విమర్శల పాలయ్యారు. తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేక వర్గంలో చేరి అదే పనిగా ఆరోపణలు గుప్పించారు . కిరణ్ ఒంటెత్తు పోకడలను మీడియా ముఖంగా కడిగిపారేశారు. కిరణ్ కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసి మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. పదవి నుంచి దిగిపోగానే శంకర్రావుకు కష్టాలు మొదలయ్యాయి.
వివాదస్పద గ్రీన్ ఫీల్డ్ భూముల కేసులో శంకర్రావును అవమానకరీతిలో అరెస్టయ్యారు. సీఎం కిరణ్ తనపై కక్ష కట్టి తనను అమానవీయంగా అరెస్టు చేయించారని శంకరన్న మండిపడ్డారు. తర్వాత అనారోగ్యంతో ఆస్పత్రిలో కొన్నాళ్లు గడిపి కోలుకుని బయటకు వచ్చిన తర్వాత శంకర్రావు తనదైన శైలిలోనే వ్యవహరిస్తున్నారు . తాజాగా మరో వివాదంలో ఆయన ఇరుకున్నారు. సొంత కోడలు వంశీప్రియ ఆయనపై కేసు పెట్టింది. శంకర్రావు, కుటుంబసభ్యులు తనను తీవ్రస్థాయిలో వేధిస్తున్నారని ఆమె హైకోర్టును ఆశ్రయించింది.కోడలి ఫిర్యాదుతో శంకర్రావు తన భార్య విశ్వశాంతితో పాటు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆధీనంలోని మహిళా పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. న్యాయస్థానం నుంచి పొందిన ముందస్తు బెయిల్ ఆసరాతోబయటపడ్డారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలూ తీసుకుంటామని పోలీసులు అంటున్నారు . మొత్తానికి ఏదోవిధంగా నిత్యం వార్తల్లో ఉండడం శంక్రరావుకు అలవాటుగా మారిపోయింది.
అందరికీ
శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టయింది మాజీ మంత్రి
శంకర్రావు పరిస్థితి. అందరికీ నీతులు బోధించే శంకన్న మరోసారి పోలీస్
స్టేషన్ మెట్లు ఎక్కాడు. స్వయానా కోడలను హింసించిన కేసులో పోలీసు స్టేషన్
లో లొంగిపోయి బెయిల్ తీసుకుని బయటపడ్డాడు. నిత్యం వివాదాలతో సావాసం,
నోటికొచ్చినట్టు మాట్లాడి సంచలనాల కోసం పాకులాడడం శంకర్రావు స్టయిల్.
గురివింద చందంగా తనకు నచ్చనివారిపై ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటు. ఇదే ఆయనకు
కష్టాలు తెచ్చిపెట్టింది.
వైఎస్ఆర్ కుటుంబంపై ఆరోపణలు చేసి రాష్ట్ర కేబినెట్ లో చోటు సంపాదించిన శంకర్రావు తన 'లూజ్ టంగ్'తో విమర్శల పాలయ్యారు. తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకుల శిబిరంలోని చేరి సమయం దొరికినప్పుడల్లా ఆయనపై దాడి చేశారు. కిరణ్ ఒంటెత్తు పోకడలను మీడియా ముఖంగా కడిగిపారేశారు. అంతేకుండా కిరణ్ కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసి మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. పదవి నుంచి దిగిపోగానే శంకర్రావుకు కష్టాలు మొదలయ్యాయి.
వివాదస్పద గ్రీన్ ఫీల్డ్ భూముల వివాదం కేసులో శంకర్రావును అవమానకరీతిలో అరెస్టయ్యారు. సీఎం కిరణ్ తనపై కక్ష కట్టి తనను అమానవీయంగా అరెస్టు చేయించారని శంకరన్న మండిపడ్డారు. తర్వాత అనారోగ్యంతో ఆస్పత్రిలో కొన్నాళ్లు గడిపి కోలుకుని బయటకు వచ్చిన తర్వాత శంకర్రావు తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. తాజాగా మరో వివాదంలో ఆయన ఇరుకున్నారు. సొంత కోడలు వంశీప్రియ ఆయనపై కేసు పెట్టింది. శంకర్రావు, కుటుంబసభ్యులు తనను తీవ్రస్థాయిలో వేధిస్తున్నారని ఆమె హైకోర్టును ఆశ్రయించింది.
కోడలి ఫిర్యాదుతో శంకర్రావు తన భార్య విశ్వశాంతితో పాటు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆధీనంలోని మహిళా పోలీసుస్టేషన్లో బుధవారం(జూన్ 19) లొంగిపోయారు. న్యాయస్థానం నుంచి పొందిన ముందస్తు బెయిల్ను ఎగ్జిక్యూట్ చేయించుకున్నని పోలీసు స్టేషన్ నుంచి బయటపడ్డారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలూ తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఏదోవిధంగా నిత్యం వార్తల్లో ఉండడం శంక్రరావుకు అలవాటుగా మారిపోయింది. అయితే ఎదుటివారిపై విమర్శలు చేసే అర్హత తనకుందో, లేదో ఇప్పటికైనా ఆయన తెలుసుకుంటే మంచిది!
వైఎస్ఆర్ కుటుంబంపై ఆరోపణలు చేసి రాష్ట్ర కేబినెట్ లో చోటు సంపాదించిన శంకర్రావు తన 'లూజ్ టంగ్'తో విమర్శల పాలయ్యారు. తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకుల శిబిరంలోని చేరి సమయం దొరికినప్పుడల్లా ఆయనపై దాడి చేశారు. కిరణ్ ఒంటెత్తు పోకడలను మీడియా ముఖంగా కడిగిపారేశారు. అంతేకుండా కిరణ్ కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసి మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. పదవి నుంచి దిగిపోగానే శంకర్రావుకు కష్టాలు మొదలయ్యాయి.
వివాదస్పద గ్రీన్ ఫీల్డ్ భూముల వివాదం కేసులో శంకర్రావును అవమానకరీతిలో అరెస్టయ్యారు. సీఎం కిరణ్ తనపై కక్ష కట్టి తనను అమానవీయంగా అరెస్టు చేయించారని శంకరన్న మండిపడ్డారు. తర్వాత అనారోగ్యంతో ఆస్పత్రిలో కొన్నాళ్లు గడిపి కోలుకుని బయటకు వచ్చిన తర్వాత శంకర్రావు తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. తాజాగా మరో వివాదంలో ఆయన ఇరుకున్నారు. సొంత కోడలు వంశీప్రియ ఆయనపై కేసు పెట్టింది. శంకర్రావు, కుటుంబసభ్యులు తనను తీవ్రస్థాయిలో వేధిస్తున్నారని ఆమె హైకోర్టును ఆశ్రయించింది.
కోడలి ఫిర్యాదుతో శంకర్రావు తన భార్య విశ్వశాంతితో పాటు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆధీనంలోని మహిళా పోలీసుస్టేషన్లో బుధవారం(జూన్ 19) లొంగిపోయారు. న్యాయస్థానం నుంచి పొందిన ముందస్తు బెయిల్ను ఎగ్జిక్యూట్ చేయించుకున్నని పోలీసు స్టేషన్ నుంచి బయటపడ్డారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలూ తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఏదోవిధంగా నిత్యం వార్తల్లో ఉండడం శంక్రరావుకు అలవాటుగా మారిపోయింది. అయితే ఎదుటివారిపై విమర్శలు చేసే అర్హత తనకుందో, లేదో ఇప్పటికైనా ఆయన తెలుసుకుంటే మంచిది!
24, ఫిబ్రవరి 2013, ఆదివారం
ఏ చానల్ చూసినా ఏమున్నది గర్వ కారణం ?
కొన్ని చానల్స్ అయితే బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నాయని ఆరోపణలు కూడా సర్వత్ర వినిపిస్తున్నాయి.ప్రస్తుతం తెలుగులో సాక్షి ,టీవీ 9,టీవీ 5,ఎన్ టీవీ ,జీ న్యూస్ ,మహా న్యూస్, ఆంధ్రజ్యోతి, టీ న్యూస్ , ఐ న్యూస్ , ఈ టీవీ ,వీ 6, హెచ్ ఏం టీవీ ,స్టూడియో యెన్ ,జెమినీ ,మెట్రో టీవీ,సీవీఆర్ ,ఆర్ కే న్యూస్ వంటి చానల్స్ వార్తలను ప్రసారం చేస్తున్నాయి.మరికొన్ని చానల్స్ 24 గంటలు నిరంతరం వార్తా ప్రసారాలను అందిస్తున్నాయి . మాటీవీ కొన్నాళ్ళు "న్యూస్ "ప్రసారం చేసి మధ్యలో మానేసింది.వీటిలో చాలా చానల్స్ రాజకీయ పార్టీలతో లింక్ లున్నవే. జగన్ పార్టీకి సాక్షి అనుబంధ సంస్త అనేది అందరికి తెల్సిందే. మహా న్యూస్, ఆంధ్రజ్యోతి ,టీవీ 9 చానల్స్ "తెలుగుదేశం "కు సహకారం అందిస్తున్నాయి.ఇక "ఈ టీవీ " సంగతి బహిరంగ రహస్యమే. తెలుగు నాట రాజకీయపార్టీలకు బహిరంగంగా మద్దతు పలికిన ఖ్యాతి "ఈనాడు"దే. తర్వాత కాలం లో క్రమంగా ప్రింట్ మీడియా లోని కొన్ని వార్తా పత్రికలూ ..... ఆపైన చానల్స్ రాజకీయ పార్టీలకు బహిరంగం గానే సపోర్ట్ ఇస్తున్నాయి. 2005 తర్వాత్ రాజకీయనేతలే చానల్స్ పెట్టె ఆనవాయితీ మొదలైంది. వైఎస్ ఇందుకు శ్రీకారం చుట్టారు.వైఎస్ అధికారంలోకొచ్చాక ఈనాడు ,జ్యోతి అయన కు వ్యతిరేక వార్తా కధనాలను ప్రచురించేవి.సొంత మీడియా వుంటే మేలని అయన సాక్షిని కొడుకు చేత మొదలెట్టించారు.
ఆ తర్వాత తెరాస నేత కేసీఆర్ పార్టీ కోసం ఒక న్యూస్ చానల్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్ గ్రూపు రెండు చానల్స్ నడుపుతుంటే, పిసిసి అధ్యక్షుడు ఒక చానల్ నడుపుతున్నారు . సీపీఎం పార్టీ కూడా కొత్త చానల్ ను ప్రారంభించ బోతోంది. ఒక దశలో ప్రస్తుత కేంద్రమంత్రి చిరంజీవి కూడా ఒక చానల్ పెట్టాలని యోచించి తర్వాత విరమించుకున్నారు. ఇటీవల కాలం లో చానల్స్ సంఖ్య పెరిగిపోవడం, ఆదాయం తగ్గడం, వ్యయం పెరగడం వంటి కారణాలుగా చానల్స్ రాజకీయ నాయకుల చేతిలోకి వెళుతున్నాయి.ఇదొక కొత్త పరిణామం. ఈ పరిణామం వల్ల చానల్స్ విశ్వసనీయతను కోల్పోతున్నాయి.అదలా ఉంటె మన చానల్స్ లో వార్తలు ఎలా ఉంటాయంటే జీ న్యూస్ లో కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ లభించే విధంగా వార్తలు ఉంటే .,,ఇక ఐ న్యూస్లో ముఖ్యమంత్రి కిరణ్ ఇమేజ్ ను బూస్టప్ చేసేలా వార్తా కధనాలు ప్రసారమౌతుంటాయి . గతంలో ఒకే వర్గం చేతిలో మీడియా ఉన్నప్పుడు చంద్రబాబు పాలనను ఏ విధంగా ఆకాశానికి ఎత్తారో ఇప్పుడు ఐ న్యూస్లో కిరణ్కు ఆ స్థానం కల్పిస్తున్నారు. సమస్యలన్నీ అదిగమించి ఆయన దూసుకెళుతున్నారట! ఇక ఆంధ్ర జ్యోతి ఈటీవీ ,టీవీ 9,మహా న్యూస్ వంటి చానల్స్ లో చంద్రబాబు కి అనుకూల వార్తలు ప్రసారమౌతుంటాయి. . ఆ చానల్స్ లో కొన్నింటికి చంద్రబాబు ఆర్ధికం గా సహాయ పడ్డారని,కొన్నింటిలో అయన వాటాదారు అని అంటారు. ఇందులో నిజం ఎంతో ఏమో గానీ ఆ చానల్స్ అన్నీ బాబుకి వ్యతిరేకంగా ఎలాంటి వార్తా కధనాలు ప్రసారం చేయవు.అవేపుడూ బాబు వ్యతిరేకులను ఉతికి ఆరేస్తుంటాయి.
ముఖ్యంగా చనిపోయిన వైఎస్ ,జైల్లో వున్నజగన్ ఆ చానల్స్ కి హాట్ సబ్జెక్ట్స్.ఇక జగన్ చానల్ సాక్షి ఆ చానల్స్ లో వచ్చే కథనాలను తిప్పి కొడుతూ బాబును ,రామోజీని తూర్పరా పడుతోంది.
టీ న్యూస్ తెలంగాణ వాదానికి, టిఆర్ఎస్కు అండగా నిలుస్తోంది. అలా అని మిగిలిని చానల్స్ నిస్పక్షపాతంగా ఉంటున్నాయని కాదు. అంశాల వారిగా, ఒప్పందాల వారిగా కొన్ని చానల్స్ కొన్ని పార్టీలకు అండగా నిలుస్తున్నాయి.ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఓ న్యూస్చానల్ను పెట్టుకోవచ్చు.దేశంలో ఇప్పటివరకు 122 న్యూస్చానల్స్ ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇవి ప్రపంచంలోనే చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ చానల్స్ మధ్య ప్రకటనల యుద్ధం కొనసాగుతుంది. గత రెండు సంవత్సరా లుగా ప్రకటనల రూపంలో ఈ చానల్స్ రూ.2,000 కోట్ల మేరకు వ్యాపారం చేశాయి. తెలుగులో 17 న్యూస్ చానళ్ళు ఉన్నాయి. ప్రకటనల ఆదాయం అన్ని చానళ్ళకు సరిపోదు. అంటే ప్రకటన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు ఈ చానళ్ళ మీద అవుతోంది. తెలుగు న్యూస్ చానళ్లలో చాలా చానల్స్ నష్టాలతోనే నడుస్తున్నాయి. మంచి మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ లేని కొరత చానల్స్ లో కన్పిస్తోంది.ఫలితంగా యాడ్ రెవిన్యూలో వెనుకబడి నష్టాల్లో కూరుకుపోతున్నాయి.
చానల్స్ కి ఎన్నికల ముందు అయితే ఆదాయం ఉంటుంది కానీ ఇప్పుడు ఆదాయం లేక చాలా చానళ్ళు విలవిల్లాడుతున్నాయి.ఈక్రమం లో అడ్డ దారి తొక్కుతున్నాయి. లేదా రాజకీయ నేతల చేతుల్లోకి వెళుతున్నాయి. గత రెండు మూడు సంవత్సరాలుగా పంపిణీ, టాలెంట్ ధరలు రెట్టింపయ్యాయి. టాలెంట్ ఖర్చులు అంటే ప్రొడ్యూ షర్లు, రిపోర్టర్లు, టెక్నిషన్స్, యాంకర్లు ఇలా వారి టాలెంట్ను బట్టి వేతనాలు ఇవ్వాలి. అలా చేయలేక కొన్ని చానల్స్ వెనుక పడుతున్నాయి. ఇక తెలుగు న్యూస్ మార్కెట్ విషయానికొస్తే.2007లో కేవలం ఐదు న్యూస్ చానల్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉండేవి.అవి ఇపుడు 17కు చేరుకున్నాయి.వీటన్నింటికి సరి పడా యాడ్ మార్కెట్లేదు.
తరువాయి పార్ట్ 2 లో
3, అక్టోబర్ 2012, బుధవారం
'సార్' స్టైల్ మార్చారు
తమిళనాడును ఆనుకొని ఉన్న చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన బాబు ఈ విషయంలో తమిళ నేతలను ఆదర్శంగా తీసుకొన్నారు. అక్కడ జయలలిత పార్టీ అన్నాడీఎంకే గుర్తు రెండాకులు. దానికి గుర్తుగా జయలలిత మొదలుకొని ఆ పార్టీ నేతలంతా ఎక్కడికి వెళ్లినా రెండు వేళ్లు చూపించేవారు. హస్తానికి ప్రత్యామ్నాయంగా ఇది బాగుందనుకొని బాబు అదే పద్ధతిని తానూ పాటించడం మొదలు పెట్టారు. ఇక్కడ దానికి విక్టరీ సంకేతంగా పేరు పెట్టారు.
సీఎంగా ఉన్నా.. ప్రతిపక్ష నేతగా ఉన్నా బాబు సింబల్గా 'వి'గా స్థిరపడిపోయింది. కానీ, తొలిసారిగా పాదయాత్రలో బాబు విక్టరీ సంకేతాన్ని పక్కనపెట్టారు. ప్రజల కష్టనష్టాలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసేటప్పుడు విక్టరీ సంకేతం చూపించడం సరైంది కాదని, దాని బదులు చక్కగా నమస్కారం చేస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచించారు. బాబు ఆ సూచనను ఆచరించి చూపించారు. తొలిరోజు పాదయాత్రలో పార్టీ నేతలు, సాధారణ ప్రజలు అలవాటు కొద్దీ ఆయనకు విక్టరీ సంకేతాన్ని చూపిస్తున్నా బాబు మాత్రం వారికి నమస్కారం పెడుతూ సాగిపోయారు. ఆ విధం గా బాబు తన స్టైల్ మార్చారు. ఇంతవరకూ బాగానే వుంది.ఈ రకమైన మార్పు బాబు అన్నిటా చూపుతారా అనేదే అసలు ప్రశ్న అని విశ్లేషకులు అంటున్నారు. '
4, ఫిబ్రవరి 2012, శనివారం
జయ పై విష ప్రయోగం జరిగిందా ??
అనగనగా ఒక అందాల యువరాణి. ఆమెకు అయినవారెవరూ ఉండరు. జగమంత కుటుంబం
నాది.. ఏకాకి జీవితం నాది అనుకుంటూ ఉంటుంది. ఆమెను నాశనం చేయటానికి అనేక
మంది కాచుకొని ఉంటారు. వారందరిని ఆమె ఎలా ఎదుర్కొందనేదే సస్పెన్స్!
..ఒకప్పుడు ఇలాంటి కథలున్న అనేక సినిమాల్లో జయలలిత హీరోయిన్గా నటించారు.
కానీ.. నిజజీవితంలోనూ ఆమె పరిస్థితి అదే! నమ్మకద్రోహాలూ.. పదవి నుంచి
తొలగించటానికి కుట్రలూ కూహకాలూ.. అసెంబ్లీలో దుశ్శాసనపర్వాలు.. వెరసి,
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఒక రంగుల విషవలయం! ఇటీవలే.. ఆమెపై
విషప్రయోగమూ, మంత్రతంత్రప్రయోగాలూ జరిగాయట!! ఈ దారుణాలన్నిటికీ ఒడిగట్టింది
మరెవరో కాదు... జయలలిత తన ప్రాణ స్నేహితురాలిగా భావించిన నెచ్చెలి
శశికళేనంటూ తెహల్కా పత్రిక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది.
పెద్దమ్మ... పురచ్చితలైవి.. అంటే జయలలిత!
ఆమెకొక నీడ ఉంది. ఆ నీడ తన నెచ్చెలి, ప్రాణస్నేహితురాలు, ఆత్మబంధువు,
అంతకన్నా ఎక్కువ.. అని జయ భావిస్తారు!
ఆ నీడ పేరు... చిన్నమ్మ.. అంటే శశికళ!
అధినేత్రికి సైతం భయపడని అన్నాడీఎంకే నేతలు కొందరు.. ఆ నీడకు భయపడతారు.
వంగివంగి దండాలు పెడతారు.
కానీ.. ఇదంతా గతం. 2011 డిసెంబర్ 17 నుంచి పరిస్థితి మొత్తం
మారిపోయింది.పెద్దమ్మ, చిన్నమ్మల మధ్య ఎన్నో ఏళ్లుగా అల్లుకున్న అనుబంధం
తెగిపోయింది.
శశికళతో సహా.. జయలలిత నివాసంలో ఉన్న ఆమె బంధువులందరినీ పురచ్చితలైవి
సన్నిహితులు బయటకు పంపేశారు. కాదుకాదు.. మెడపట్టి బయటికి గెంటినంత పని
చేశారు. ఎందుకలా వెళ్లగొట్టారు? అసలేం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ
ఇప్పటికీపూర్తిగా బయటకు రాలేదు. అయితే, అన్నాడీఎంకే నేతలు చెప్పారంటూ
తెహల్కా పత్రిక ఇటీవలే ఒక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది.దాని
ప్రకారం... రెండు నెలల క్రితం ఒక ఎన్నారై తమిళనాడులో పెట్టుబడులు
పెట్టడానికి వచ్చాడు. అందరి మాదిరిగానే పెట్టుబడుల విషయంలో చిన్నమ్మను
కలిశాడు. సహజంగానే.. చిన్నమ్మ , ఆమె బంధువులు (మన్నార్గుడి మాఫియా అని
కొందరు పిలుచుకుంటూ ఉంటారు) ఆ ఎన్నారై దగ్గర 15 శాతం 'కట్' అడిగారు. అలా
కమిషన్ ఇవ్వడానికి ఇష్టపడని ఆ ఎన్నారై గుజరాత్కు వెళ్లాడు. ఆ
రాష్ట్రముఖ్యమంత్రి మోడిని కలిశాడు.
మోడి ఈ విషయాన్ని ఒక సందర్భంలో జయలలితకు చెప్పారు. జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు ఎదురువుతాయని హెచ్చరించారు. ఇది జరిగిన వెంటనే చెన్నై మోనో రైలు ప్రాజెక్టు వివాదం జరిగింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును సింగపూర్కు చెందిన ఒక కంపెనీకి ఇవ్వమని జయలలిత అధికారులకు చెప్పారు. కానీ ఆ ఫైల్ ఆమె దగ్గరకు వచ్చేసరికి... మలేసియా కంపెనీ దక్కించుకున్నట్లు ఉంది. కానీ, అందులో పెట్టిన సంతకం ఆమెది కాదని.. ఎవరో జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేశారని తేలింది. శశికళను అడిగితే తనకు తెలియదని సమాధానం చెప్పింది. ఈ నేపథ్యంలోనే వారిద్దరికీ మధ్య దెబ్బలాట జరిగింది. శశికళపై అనుమానం రావడంతో... జయలలిత తాను తీసుకొనే మందుల గురించి డాక్టర్లను సంప్రదించారు. ఆమె వాడుతున్న మందులను వైద్యులు పరీక్షించగా.. ఎవరో ఆమెకు మత్తుమందులు, చిన్న మొత్తంలో విషం ఇస్తున్నట్లు తేలింది.జయలలితకు రోజూ మందులు ఇవ్వటానికి, పళ్లరసాలు అందించటానికి ఒక నర్సు ఉంది. ఆమె కూడా శశికళ నియమించిన వ్యక్తే. దీంతో జయలలితలో కొంత కంగారు మొదలయింది. అదే సమయంలో.. డీఎంకే నేత స్టాలిన్పై పెట్టిన కేసు చాలా బలహీనంగా ఉందని.. దీనికి శశికళే కారణమని కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీనిపై జయలలిత అప్పటి ఐజీ పోన్ మణికేవల్ను ప్రశ్నించారు. శశికళ బలహీనమైన కేసు పెట్టమని చెప్పారని ఆయన వెల్లడించడంతోపరిస్థితి చేయి దాటిపోయిందని జయకు అర్థమైంది.
మోడి ఈ విషయాన్ని ఒక సందర్భంలో జయలలితకు చెప్పారు. జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు ఎదురువుతాయని హెచ్చరించారు. ఇది జరిగిన వెంటనే చెన్నై మోనో రైలు ప్రాజెక్టు వివాదం జరిగింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును సింగపూర్కు చెందిన ఒక కంపెనీకి ఇవ్వమని జయలలిత అధికారులకు చెప్పారు. కానీ ఆ ఫైల్ ఆమె దగ్గరకు వచ్చేసరికి... మలేసియా కంపెనీ దక్కించుకున్నట్లు ఉంది. కానీ, అందులో పెట్టిన సంతకం ఆమెది కాదని.. ఎవరో జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేశారని తేలింది. శశికళను అడిగితే తనకు తెలియదని సమాధానం చెప్పింది. ఈ నేపథ్యంలోనే వారిద్దరికీ మధ్య దెబ్బలాట జరిగింది. శశికళపై అనుమానం రావడంతో... జయలలిత తాను తీసుకొనే మందుల గురించి డాక్టర్లను సంప్రదించారు. ఆమె వాడుతున్న మందులను వైద్యులు పరీక్షించగా.. ఎవరో ఆమెకు మత్తుమందులు, చిన్న మొత్తంలో విషం ఇస్తున్నట్లు తేలింది.జయలలితకు రోజూ మందులు ఇవ్వటానికి, పళ్లరసాలు అందించటానికి ఒక నర్సు ఉంది. ఆమె కూడా శశికళ నియమించిన వ్యక్తే. దీంతో జయలలితలో కొంత కంగారు మొదలయింది. అదే సమయంలో.. డీఎంకే నేత స్టాలిన్పై పెట్టిన కేసు చాలా బలహీనంగా ఉందని.. దీనికి శశికళే కారణమని కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీనిపై జయలలిత అప్పటి ఐజీ పోన్ మణికేవల్ను ప్రశ్నించారు. శశికళ బలహీనమైన కేసు పెట్టమని చెప్పారని ఆయన వెల్లడించడంతోపరిస్థితి చేయి దాటిపోయిందని జయకు అర్థమైంది.
బెంగళూరులో రహస్య సమావేశం
2011, డిసెంబర్ మొదటివారంలో.. శశికళ కుటుంబసభ్యులందరూ కలిసి బెంగళూరులో నిర్వహించిన ఒక సమావేశం గురించి తమిళనాడు డీజీపీ కె.రామానుజం జయలలితకు చెప్పారు. ఈ సమావేశాన్ని బెంగళూరు ఇంటిలిజెన్స్ విభాగం అధికారులు ట్యాప్ చేశారు. ఆ టేపులను కర్ణాటక డీజీపీ శంకర్ బిదారీ తమిళనాడు డీజీపీ రామానుజంకు ఇచ్చారు. జయలలితకు వ్యతిరేకంగా తీసుకున్న అనేక నిర్ణయాలు ఆ టేపుల్లో ఉన్నాయి. ఈ టేపులు విన్న తర్వాత జయలలితకు వాస్తవ పరిస్థితి అర్థమైంది. వెంటనే ఆమె.. శశికళపైనా, ఆమె కుటుంబసభ్యులపైనా నిఘా పెట్టమని పోలీసులను ఆదేశించారు. వారి ఫోన్లన్నిటినీ ట్యాప్ చేయటం మొదలుపెట్టారు.
అనంతరం చకచకా పావులు కదిపి శశికళకు సన్నిహిత అధికారులను బదిలీ చేశారు. మంత్రివర్గాన్ని హాజరుపరచి ఇకపై అన్ని నిర్ణయాలు తనను అడిగే తీసుకోవాలని.. ఏవిషయంలోనూ శశికళ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. అనంతరం డిసెంబర్ 17న శశికళను, ఆమె బంధువులను ఇల్లు వదిలిపొమ్మని జయలలిత ఆదేశించింది. వీరిలో చాలా మంది ఆ ఇంట్లో 1989 నుంచి నివాసం ఉంటున్నారు. వారందరూ జయలలిత కాళ్లావేళ్లా పడ్డారు. కానీ జయ కరగలేదు. 'అమ్మ' అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందో... ఆగ్రహం అంత కఠినంగా ఉంటుందని వారందరికీ అర్థమైంది.తాంత్రిక పూజలు కూడా... అదే సమయంలో రాష్ట్ర మంత్రి కె.వి. రామలింగం ముఖ్యమంత్రిని కలవటానికి వచ్చారు. జయలలిత ఆయనను చూసి చిరునవ్వు నవ్వి.. "భవిష్యత్తు ముఖ్యమంత్రిగారికి స్వాగతం'' అని వ్యంగ్యంగా ఆహ్వానించారట. దాంతో రామలింగానికి ముచ్చెమటలు పట్టాయి! నిజానికి రామలింగం శశికళ మనిషి.ఆయనకు మూఢనమ్మకాలున్నాయని, మంత్ర, తంత్ర శాస్త్రాలను నమ్ముతారని.. 2011లో పార్టీ గెలవటానికి పూజలు చేశారని చెప్పుకొంటారు. అయితే గత కొన్ని నెలలుగా రామలింగం కేరళలో ఉన్న ఒక తాంత్రికుడిని ఉపయోగించి పూజలు చేయిస్తున్నాడని నిఘా వర్గాలు కనుగొన్నాయి. జయలలితను తొలగించి శశికళను ముఖ్యమంత్రి చేయాలనేది తన ఉద్దేశమని పైకి చెబుతున్నా.. రామలింగం శశికళను కూడా మోసం చేశారని.. తాను ముఖ్యమంత్రి అయ్యేందుకేపూజలు చేయించారని ప్రచారం. ఈ విషయం తెలియడంతోనే జయ ఆయనను "భవిష్యత్తు ముఖ్యమంత్రిగారు'' అని వ్యంగ్యంగా సంబోధించినట్టు చెబుతున్నారు
శశికళ ఆస్తులు.. రూ5వేల కోట్లు
శశికళ వ్యాపార సామ్రాజ్యం విలువ రూ.5000 కోట్లని అంచనా. 2011 ఎన్నికల్లో కూడా శశికళ, ఆమె బంధువులు అసెంబ్లీ టిక్కెట్లు అమ్ముకున్నారని, దీనిద్వారా దాదాపు రూ.300 కోట్లు సంపాదించారనేది ఒక అంచనా. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వీరందరూ రూ.వెయ్యి కోట్లకు పైగా సంపాదించారని సమాచారం. వీరి పెట్టుబడులు తమిళనాడు, కర్ణాటక, కేరళలతో పాటు.. దుబాయ్, సింగపూర్లకు కూడా విస్తరించాయి.
మన్నార్గుడి మాఫియా
శశికళ, ఆమె భర్త నటరాజన్, ఆమె అన్న వి.కె.దివాకరన్ (ముద్దు పేరు బాస్), శశికళ బాబాయి డాక్టర్ కరుణాకరన్ కుమార్తెను పెళ్లి చేసుకున్న రావణన్, మిడాస్ మోహన్ (నటరాజన్ వ్యాపారాల్లో పార్ట్నర్), వి.కె. సుధాకరన్, టీటీవీ దివాకరన్( శశికళ మేనల్లుళ్లు), ఎం. రామచంద్రం (శశికళ ఇంకో అన్న)... వీరందరినీ కలిపి తమిళ రాజకీయాల్లో 'మన్నార్గుడి మాఫియా'గా పిలుచుకుంటారు.
courtesy...andhrajyothy
శశికళ వ్యాపార సామ్రాజ్యం విలువ రూ.5000 కోట్లని అంచనా. 2011 ఎన్నికల్లో కూడా శశికళ, ఆమె బంధువులు అసెంబ్లీ టిక్కెట్లు అమ్ముకున్నారని, దీనిద్వారా దాదాపు రూ.300 కోట్లు సంపాదించారనేది ఒక అంచనా. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వీరందరూ రూ.వెయ్యి కోట్లకు పైగా సంపాదించారని సమాచారం. వీరి పెట్టుబడులు తమిళనాడు, కర్ణాటక, కేరళలతో పాటు.. దుబాయ్, సింగపూర్లకు కూడా విస్తరించాయి.
మన్నార్గుడి మాఫియా
శశికళ, ఆమె భర్త నటరాజన్, ఆమె అన్న వి.కె.దివాకరన్ (ముద్దు పేరు బాస్), శశికళ బాబాయి డాక్టర్ కరుణాకరన్ కుమార్తెను పెళ్లి చేసుకున్న రావణన్, మిడాస్ మోహన్ (నటరాజన్ వ్యాపారాల్లో పార్ట్నర్), వి.కె. సుధాకరన్, టీటీవీ దివాకరన్( శశికళ మేనల్లుళ్లు), ఎం. రామచంద్రం (శశికళ ఇంకో అన్న)... వీరందరినీ కలిపి తమిళ రాజకీయాల్లో 'మన్నార్గుడి మాఫియా'గా పిలుచుకుంటారు.
courtesy...andhrajyothy
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)





